ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు

by Gantepaka Srikanth |
ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర్య అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. రేపు(బుధవారం) నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆగష్టు 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావించినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్య బ‌లాన్ని ప‌రిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. పోటీకి దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుపు లాంఛనం కానుంది.

Advertisement

Next Story

Most Viewed